Monday, April 29, 2024

త్రిష కన్నా శృతిహాసన్ కే అవకాశాలు ?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ గా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కు సంబంధించిన రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.

ప్రస్తుతం త్రిష శృతిహాసన్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. త్రిష ఇదివరకే బాలకృష్ణ తో లయన్ సినిమాలో నటించింది. ఇక శృతి హాసన్ గోపీచంద్ దర్శకత్వంలో బలుపు క్రాక్ సినిమాలలోనటించి సక్సెస్ అందుకుంది. దీంతో గోపి చంద్ శృతి వైపే మొగ్గు చూపుతున్నారట. ఏదేమైనా బాలకృష్ణ సినిమాలో శృతి హసన్ కనిపించే అవకాశం ఎక్కువగా ఉందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement