Thursday, May 2, 2024

బాహుబ‌లి2కి.. ఆరేళ్లు

28 April 2017న బాహుబ‌లి2 రిలీజ్ అయింది. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి.ఈ చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతి ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలిసింది.ఈ చిత్రం సూప‌ర్ హిట్ట్ గా నిలవ‌డంతో సీక్వెల్ గా బాహుబ‌లి2ని కూడా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.కాగా బాహుబలితో ఏకంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి చరిత్ర సృష్టించింది. స్టార్ న‌టీ న‌టులు ప్ర‌భాస్..అనుష్క‌,రానా,త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.కాగా ఇప్పటికీ ఇండియాలో అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమా రికార్డు బాహుబలి-2 పేరిటే ఉంది. కాగా శుక్రవారంతో ఈ సినిమా ఆరేళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా ఫైనల్‌ రన్‌లో ఎంత వసూళు చేసిందో ఓ లుక్కేద్ధాం. బాహుబలి2’ సినిమాకు అప్పట్లో దాదాపు రూ. 350 కోట్ల బిజినెస్‌ జరిగింది. అప్పట్లో ఇంత వస్తుందా అని అంతా కంగారు పడ్డారు కానీ విడుదలైన తర్వాత ఈ చిత్ర ప్రభంజనం చూసి అంతా నోరెళ్లబెట్టుకున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.450 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చి బాహుబలి-2 సంచలనం సృష్టించింది. కేవలం థియేట్రికల్ కలెక్షన్స్ రూపంలోనే రూ.814 కోట్లకు పైగా వచ్చాయి. రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement