Monday, April 29, 2024

బిఏ రాజు మృతి తీరని లోటు….యంగ్ టైగర్ ఎన్టీఆర్

బిఏ రాజు మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. కాగా రాజు మరణవార్త విన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రాజు తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయన ఆకస్మిక మరణం తనను షాక్ కు గురి చేసిందనిమ్.. ఒక సీనియర్ ఫిలిం జర్నలిస్టుగా పిఆర్ గా సినిమా ఇండస్ట్రీకి రాజు గారు చాలా చేశారని… అలాగే ఆయన తన కెరీర్ ప్రారంభం రోజు నుంచే తెలిసని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం అతి పెద్ద లోటు అని అన్నారు ఎన్టీఆర్.

రాజు గారి కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్ చేశారు. అయితే రాజు శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement