Friday, April 26, 2024

కళామతల్లి చేదోడు….600 మందికి సహాయం

కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. అలాగే సినీ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది సినీ ప్రముఖులు రోజువారి కూలీలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాగా ఈ రోజు ఉదయం ఫిలింఛాంబర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, చదలవాడ శ్రీనివాస్ ,ఎలమంచిలి రవిచందర్ ఆధ్వర్యంలో కళామతల్లి చేదోడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్ కి ,జూనియర్ ఆర్టిస్టులకు, ప్రొడక్షన్ వర్కర్స్ కి, సుమారు 600 మందికి నిత్యవసర వస్తువులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎలమంచిలి రవి చంద్ర మాట్లాడుతూ కష్టకాలంలో ప్రతి పేద సినిమా కార్మికుడు కార్మికురాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వారందరిని దృష్టిలో పెట్టుకొని ఆదుకోవడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టామని… తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నాలుగు వేల మంది కార్మికులు ఉన్నారని వారు అందరికీ ఒకేసారి పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతం 600 మందికి మొదటి విడతగా సహాయం చేయడం జరిగిందని దశలవారీగా అందరికీ సహాయం అందజేస్తామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement