Thursday, May 2, 2024

డిఫ‌రెంట్ స్టోరీ లైన్​తో యాంగ్రీ హీరో.. మే 20న ‘శేఖ‌ర్’ వ‌స్తున్నాడు!

యంగ్రీమ‌న్‌ రాజ‌శేఖ‌ర్ క‌థ‌లను ఎంపిక చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింద‌నే చేప్పాలి. కొంత కాలంగా వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాజ‌శేఖ‌ర్‌కు 2017లో రిలీజైన ‘గ‌రుడ వేగ’ క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధించి కాస్త ఊర‌టనిచ్చింది. ఈ చిత్రం త‌ర్వాత వ‌చ్చిన కల్కి కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి ప్ర‌శంస‌ల‌నే ద‌క్కించుకుంది. ఇక క‌ల్కి త‌ర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని శేఖ‌ర్ సినిమాతో ప‌లకరించ‌డానికి సిద్ధ‌మవుతున్నాడు. రాజ‌శేఖ‌ర్ స‌తీమ‌ణి జీవిత ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ట‌యిన “జోసేఫ్” సినిమాకి రీమేక్‌గా తెర‌కెక్కిస్తోన్న సినిమా ఇది. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ని విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని మే 20న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్నట్లు వెల్ల‌డించారు చిత్ర నిర్మాత‌లు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, పోస్ట‌ర్స్, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమాలో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ కీల‌కపాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రానికి మొద‌ట ల‌లిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కానీ, కొన్ని కార‌ణాల వ‌ల్ల అత‌ను త‌ప్పుకున్నాడు. దాంతో జీవిత ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని బీర‌మ్ సుధాక‌ర్ రెడ్డి నిర్మించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement