Sunday, April 28, 2024

సలార్ వారికే ? ఇప్పుడు ఆదిపురుష్ కూడానా ?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేజిఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా… శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ తీసుకున్నట్టు గతంలో ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా డిజిటల్ హక్కుల విషయంలో కూడా అమెజాన్ ప్రైమ్ పోటీ పడుతుందట. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. కృతిసనన్ సీతగా కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement