Friday, April 26, 2024

శ్రీనువైట్ల తో అక్కినేని హీరో ?

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్లు అవుతున్నా సరైన హిట్ ని కొట్టేలేక పోయాడు అక్కినేని అఖిల్. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్.

ఇదిలా ఉండగా అఖిల్ సినిమాలకు సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ లవ్ స్టోరీ సినిమా చేయబోతున్నాడట అఖిల్. ఆ సినిమాను శ్రీను వైట్ల డైరెక్ట్ చేయబోతున్నాడట. అయితే వచ్చే ఏడాది ఈ సినిమా ఉండబోతుందట. మరి చూడాలి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఈ వార్త లో ఎంతవరకు నిజం ఉందొ.

Advertisement

తాజా వార్తలు

Advertisement