Tuesday, May 7, 2024

రేర్ పిక్.. ఒకే వేదిక‌పై థ‌మ‌న్.. దేవిశ్రీ

తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ రెండో సీజన్ బాగా రన్ అవుతుంది. తాజాగా ఈ సీజ‌న్ సెమీఫైనల్‌కి చేరుకుంది. దీనికి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఎస్‌ థమన్‌ జడ్జ్ గా ఉన్నారు. ఆయన సారథ్యంలోనే ఈ పాటల కార్యక్రమం ఆహాలో విజయవంతంగా రన్‌ అవుతుంది. అయితే తాజాగా మరో మ్యూజిక్‌ సెన్సేషన్‌ దేవిశ్రీ ప్రసాద్‌ తోడయ్యారు. థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. కానీ ఓ అరుదైన, అద్భుతమైన దృశ్యానికి నడుం బిగించింది. ఇద్దరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. తెలుగు ఇండియన్‌ ఐడల్‌ 2 సెమీ ఫైనల్‌ కోసం దేవిశ్రీ ప్రసాద్‌ గెస్ట్ గా హాజరు కావడం విశేషం. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలియజేస్తూ వీరి ఫోటోలను పంచుకుంది.

ఇందులో థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ హగ్‌ చేసుకున్నారు, ఒకరిపై ఒకరు చేతులేసి డాన్సులు చేశారు. పాటలతో అలరించారు. ఇద్దరు కలిసి పాట కంపోజ్‌ చేసి వాహ్‌ అనిపించింది. ఓ అద్భుత దృశ్యాన్ని ఆడియెన్స్ ముందు ఉంచారు. తెలుగు ఇండియన్‌ఐడల్‌ 2 సెమీఫైనల్‌కి దేవిశ్రీ ప్రసాద్‌ జడ్జ్ గా వ్యవహరించారు. తనదైన మ్యూజికల్‌ టచ్‌తో షోని రక్తికట్టించారు. ఈ షోలో ఈ ఇద్దరు లెజెండ్ మ్యూజిక్‌ డైరెక్టర్లు కలిసి కంపోజ్‌ చేసిన మ్యూజిక్‌ ఎంతగా ఆకట్టుకుంటుందని, శ్రోతలను ఉర్రూతలూగిస్తుందని నిర్వహకులు తెలిపారు. మరోవైపు ఇందులో శృతి అనే కంటెస్టెంట్‌(గాయని)తో కలిసి దేవిశ్రీ ప్రసాద్‌ చేసిన పర్‌ఫెర్మెన్స్ అద్భుతంగా ఉంందని, షోని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఉందని, అది అందరిని అలరిస్తుందని చెప్పారు. థ‌మ‌న్..దేవిశ్రీప్ర‌సాద్ ఒకే వేదిక‌పై క‌న‌ప‌డ‌టం అరుద‌నే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement