Thursday, May 2, 2024

చంద్ర‌బాబు, ప‌వ‌న్ కు ప్ర‌జ‌లే గుణ‌పాఠం చెప్తారు… మంత్రి కాకాని

వైసిపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓర్వలేకపోతున్నారని.. వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… అకాల వర్షాలతో తడిచిన, రంగు మారిన ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీకి కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని తెలిపారు.

వచ్చే ఎన్నికలలో వైసిపి 175 స్థానాలలో ఘనవిజయం సాధిస్తుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అలాగే టిడిపి అధినేత నారా చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. అసహ్యాన్ని జయించిన నాయకుడు చంద్రబాబు అని.. ఆయన మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు. రాష్ట్రానికి తుఫానులు రాకుండా కూడా అడ్డుకున్నామని గొప్పలు చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై రైతులను ఉసిగొల్పాలనే దురుద్దేశంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement