Saturday, May 4, 2024

సీత, లక్ష్మణుడు కూడా వచ్చేశారు… ఆదిపురుష్ అప్డేట్

ఆదిపురుష్ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ పక్కన సీతగా నటించేది ఎవరు? లక్ష్మణుడిగా నటించేది ఎవరు? అంటూ వస్తున్న రకరకాల వార్తలకు చిత్రయూనిట్ తెరదించింది. సీతగా కృతిసనన్ పేరును అధికారికంగా ప్రకటించింది. ఆమెకు వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఓ ఫోటోని పోస్ట్ చేశాడు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సన్నీ సింగ్‌ను తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక సైఫ్ అలీఖాన్ రావణ్ గా నటించబోతున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ, భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2022 ఆగస్టు 11న ఈచిత్రం రిలీజ్ చేయనున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement