Sunday, April 28, 2024

Re-release | ఆహాలో కొత్త ట్రెండ్.. ఇక ఓటీటీల్లోనూ రీ-రిలీజ్ లు

మ‌హేష్ బాబు పోకిరి సినిమాతో మొదలైన రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉంది. కొత్త సినిమాల రిలీజ్‌ల సందడి కంటే రీ-రిలీజ్‌ల సందడి ఎక్కువ కనిపిస్తుంది. హీరోల పుట్టినరోజని, పండుగా రోజని, హీరోల కెరీర్ స్టార్ట్ చేసి మైల్ స్టోన్ కి చేరుకున్నారని, లేదా సూపర్ హిట్ మూవీ యానివర్సరీ అని.. ఇలా ఏదో కారణంతో రీ-రిలీజ్‌లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు. అయితే టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ రీ రిలీజ్స్‌లో కొత్త ట్రెండ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

https://twitter.com/ahavideoIN/status/1717878348142322061

రీ-రిలీజ్ లు అంటే థియేటర్స్ లోనే ఉంటాయా ఏంటి..? ఓటీటీలో కూడా తీసుకు వస్తున్నాము అంటూ పోస్ట్ వేశారు. తమ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ఈ రీ-రిలీజ్ ల ట్రెండ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. తమ నిర్మాణంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మగధీర’తో ఈ ట్రెండ్ ని మొదలు పెట్టబోతున్నట్లు వెల్లడించారు. నవంబర్ 3న ప్రీమియం క్వాలిటీతో మగధీరని ఆహాలో రీ-రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఈ మూవీ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ఆల్ టైం ఫేవరెట్ సినిమా ‘అతడు’ని నవంబర్ 10న‌ రీ-రిలీజ్ చేయనున్నారు. ఇక నవంబర్ 17న అల్లు అరవింద్ నిర్మాణం నుంచి వచ్చిన మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ని రిలీజ్ చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement