Sunday, May 5, 2024

TS | వ్యభిచార గృహాలపై టాస్క్ ఫోర్స్ దాడి.. ఐదుగురు విటులు, నగదు స్వాధీనం

నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్) : నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగెనవార్ ఆదేశాల మేరకు ఏసీపీ టాస్క్ ఫోర్స్ రాజశే ఖర్ రాజు ఆధ్వర్యంలో వ్యభిచార గృహాలపై ఇవ్వాల (శుక్రవారం) దాడులు నిర్వహించారు. నమ్మదగిన సమాచారంపై నిజామాబాద్ పట్టణంలో ఏక కాలంలో మూడు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి నిర్వాహకులతోపాటు 5 గురు విటులను, 10 మంది బాధి తులను నగదు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు, వ్యభిచార గృహాల నిర్వాహకులను, 5 గురు విటులను తదుపరి చర్య నిమిత్తము సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ లకు అప్పగించారు. 10 మంది బాధిత మహిళను రక్షిత గృహం కు తరలించారు. ఈ దాడు ల్లో సీఐలు అజయ్, అంజయ్య, సిబ్బంది రాములు, రాంచందర్, అనిల్, భూషణ్, లక్ష్మయ్య, శంకర్, నర్సయ్య, గజేందర్ , ఆజాం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement