Friday, May 17, 2024

35 మంది కొత్త వారితో మేమ్ ఫేమ‌స్ మూవీ..

సరికొత్త కథలతో సినిమాలు నిర్మించే ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. 35మంది కొత్తవారితో పాటు-, సినిమా కం-టె-ంట్‌ విడుదలకు ముందే ఫేమస్‌ అయిపోయింది. ఈ సందర్భంగా ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్ర యూనిట్‌ థావత్‌ అనే ప్రోగ్రామ్‌ నిర్వహించి టీ-జర్‌, రెండు పాటలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, చంద్రు మనోహర్‌, సంగీత దర్శకుడు కళ్యాణ్‌ నాయక్‌, కెమెరామెన్‌ శ్యామ్‌, ఎడిటర్‌ సృజన, సౌండ్‌ డిజైనర్‌ నాగార్జున, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సూర్య చౌదరి, నటీ-నటు-లు మణి, మౌర్య చౌదరి, కిరణ్‌ మచ్చ, అంజిమామ, నరేంద్ర రవి, మురళీధర్‌ గౌడ్‌, శివనందన్‌, సిరిరాశి, సార్య, రచయిత, దర్శకత్వం సుమంత్‌ ప్రభాస్‌ హాజరయ్యారు.

అనంతరం నిర్మాత శరత్‌ చంద్ర మాట్లాడుతూ, ” అంతా కొత్త వారిని పరిచయం చేయడం ఆనందంగా వుంది. 2012 లో నేను, అనురాగ్‌ జర్నీ మొదలు పెట్టాం. ఫస్ట్‌ షో పేరుతో వంద సినిమాలకు మార్కెటింగ్‌ చేశాం. 2016 లో ఛాయ్‌ బిస్కట్‌ మొదలుపెట్టాం. ఈ సినిమా జర్నీ చూస్తుంటే మాకే ఆశ్చర్యం కలిగింది. ఈ సినిమా ను. గీతా ఆర్ట్స్‌ రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ” అని అన్నారు.
నిర్మాతల్లో మరొకరు అనురాగ్‌ రెడ్డి మాట్లాడుతూ, ” మే 26న మా సినిమా విడుదలవుతుంది. ” అన్నారు.
రచయిత, దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ,” కొత్తవారిని ఎంకరేజ్‌ చేయడానికే ఛాయ్‌ బిస్కెట్‌ సంస్థను పెట్టారు. అందుకు దె³ర్యం చేసిన నిర్మాతలకు థ్యాంక్స్‌ చెపుతున్నా. ” అన్నారు. సంగీత దర్శకుడు కళ్యాణ్‌ నాయక్‌ మాట్లాడుతూ,” రైటర్‌ పద్మభూషణ్‌ తర్వాత ఈ బేనర్‌ లో అవకాశం ఇచ్చారు. ఈరోజు రెండు పాటలు చూశారు. ఇంకా ఏడు పాటలున్నాయి.” అని తెలిపారు. ఇంకా లహరి ఫిలింస్‌ చంద్రు మనోహర్‌, కెమెరా మెన్‌ శ్యామ్‌, నటు-డు మౌర్య, మణి యేగుర్ల, నటి సిరి రాశి, నటి సార్య తదితరులు సినిమా గురించి మాట్లాడారు. దావత్‌ కార్యక్రమం తీన్‌ మార్‌ డప్పులు, డాన్స్‌ తో మేమ్‌ ఫేమస్‌ టీ-మ్‌ సందడి తో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement