Saturday, May 4, 2024

స్కూటీపై చక్కర్లు కొట్టిన ‘ఛార్మీ..విజయ్ దేవరకొండ’

దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం లైగర్ కి నిర్మాత ఛార్మీ. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్, ఛార్మీలు ముంబైకు చేరుకోగా ప్ర‌స్తుతం కొన్ని కీల‌క స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్నారు. అయితే షూటింగ్ గ్యాప్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎక్కించుకొని బైక్ రైడింగ్‌కు వెళ్లింది ఛార్మి.  ముంబయి రోడ్ల మీద టూ వీలర్ పై విజయ్ దేవరకొండ‌తో చ‌క్క‌ర్లు కొట్టింది. ఆ ఫొటోల‌ను త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన ఈ అమ్మ‌డు విజ‌య్ న‌న్ను న‌మ్మి నా బైక్ ఎక్కాడు. షూటింగ్ గ్యాప్‌లో ముంబై వీధుల్లో చ‌క్క‌ర్లు కొట్టాం అని కామెంట్ పెట్టింది. . తెలుగు తో పాటు హిందీలో కూడా రూపొందుతున్న ఈ సినిమా ను ఇతర భాషల్లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement