Tuesday, April 23, 2024

ఇంద్ర‌క‌ర‌ణ్…రాజ‌కీయ స‌న్యాసం తీసుకోః బిజెపి ఎంపి ధ‌ర్మ‌పురి

నిర్మల్: 30 ఏళ్ల అనుభవం ఉన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలను కుక్కలతో పోల్చడం సిగ్గు చేటని విమర్శించారు బిజెపి ఎంపి ధ‌ర్మ‌పురి అర‌వింద్… నిర్మ‌ల్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఇటువంటి వ్యాఖ్యాలు చేసిన మంత్రి ఇంద్రకరణ్ రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో ఉండిపోవడం మేలు అని హితవుపలికారు. వయస్సులో చిన్నవాడైన కేసీఆర్ కాళ్ళు మొక్కిన రోజే ఇంద్రకరణ్ రెడ్డి ఆత్మగౌరవం చచ్చి పోయిందని ఎంపీ అన్నారు. నిర్మల్‌లో మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న భూ కబ్జాలపై రాబోయే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి జప్తు చేస్తుందని స్పష్టం చేశారు. రోహింగ్యా ముస్లింలకు పదుల సంఖ్యలో పాస్ పోర్టులు ఇచ్చారన్నారు. భైంసాలో హిందువుల ఇళ్ళు తగలబెడితే మంత్రి కనీసం స్పందించలేదని మండిపడ్డారు. రామమందిరానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తుంటే జీర్ణించుకోలేని పార్టీ మీది అని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement