Sunday, April 28, 2024

సారంగదరియా వివాదం ముగిసినట్లేనా..?

లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగ దరియా’ పాటపై నెలకొన్న వివాదంపై ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. చాలా ఏళ్ల క్రితం ‘రేలా రే రేలా’ ప్రోగ్రాంలో శిరీష అనే అమ్మాయి ఈ పాట పాడిందని, అది ఇప్పటికీ తన మనసులో అలానే ఉండడంతో ‘లవ్ స్టోరీ’కి తగ్గట్టుగా పాట రాయాలని సుద్దాల అశోక్ తేజను కోరినట్టు శేఖర్ కమ్ముల చెప్పారు. శిరీషతోనే పాటను పాడిద్దామని అనుకున్నామని, అయితే అప్పటికి ఆమె గర్భిణి కావడంతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆమెతో చర్చలు ఆపేశామని, దీనికి తోడు కరోనా కారణంగా షూటింగ్ కూడా ఆగిపోయిందని అన్నారు.

అయితే, పాటను తానే వెలుగులోకి తీసుకొచ్చానని, తనతో పాడిస్తానని చెప్పి మరొకరితో పాడించారంటూ కోమలి అనే జానపద గాయని ఆరోపించడంతో ఈ పాట చుట్టూ వివాదం నెలకొంది. ఆడియో ఫంక్షన్‌లో పాడేందుకు కూడా కోమలి అంగీకరించారని, పాట విడుదల చేసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు శేఖర్ వివరించారు. కోమలికి తగిన మొత్తం ఇస్తామని, ఆడియో వేడుకకు పిలిచి గౌరవిస్తామని పేర్కొన్నారు.

సారంగదరియా సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 37 మిలియన్స్ సొంతం చేసుకుంది పాటలో సాయి పల్లవి డాన్స్ ఇరగదీసింది శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ పాటని మరో స్థాయికి తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ మూవీ ఏప్రిల్ 16న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement