Tuesday, April 30, 2024

మ్యూజిక్ ఆల్బమ్ లో ‘రష్మిక’

ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది హీరోయిన్ రష్మిక మందన.  టాప్ టక్కర్ అనే మ్యూజిక్ ఆల్బమ్ తో పాన్ ఇండియా ప్రేక్షకులకి పరిచయం కానుంది రష్మిక మందన. బాలీవుడ్ ర్యాపర్స్ బాద్ షా..ఉచనా అమిత్ లతో పాటు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కలిసి ఈ ఆల్బమ్ ని క్రియేట్ చేయడం విశేషం. ఇక ఈ సాంగ్ ని ఉచనా – బాద్షా – యువన్ మరియు జోనితా గాంధీ కలిసి ఆలపించారు. తాజాగా ‘టాప్ టక్కర్’ టీజర్ ని విడుదల చేశారు. డ్యూయల్ రోల్ లో ఉన్న ఉచనా అమిత్ మరియు బాద్షా కలిసి రష్మిక మందనను ఇంప్రెస్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో ఈ టీజర్ లో చూపించారు. ‘టాప్ టక్కర్’ సాంగ్ కి యువన్ శంకర్ రాజా మరియు బాద్షా కలసి సంగీతం సమకూర్చారు. విగ్నేష్ శివన్ మరియు బాద్షా కలిసి సాహిత్యం అందించారు. దీనికి అమర్ ప్రీత్ జిఎస్ చబ్రా దర్శకత్వం వహించారు. ఈ ఆల్బమ్ యష్ రాజ్ ఫిల్మ్స్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో రాబోతుంది. కాగా  త్వరలోనే  ఈ మ్యూజిక్ ఆల్బమ్  విడుదల తేదీని ప్రకటించనున్నారు. ‘టాప్ టక్కర్’ టీజర్ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “టాప్ టాప్ టాప్ టక్కర్.. ఇది చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. ఫస్ట్ టైం ఇలాంటి సాంగ్ చేసాను.. త్వరలోనే  విడుదల కానుంది. వివాహాలు పాఠశాల కార్యక్రమాలు పార్టీలు ఇలా ప్రతిచోటా నేను దీనిని వింటానని నాకు తెలుసు !! నన్ను నమ్మండి మీరు ఇక్కడ మంచి డ్యాన్స్ నంబర్ కోసం ఉన్నారు!” అని రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement