Sunday, May 26, 2024

మార్చి 26న ‘రంగ్ దే’..షూట్ కంప్లీట్

యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న రంగ్ దే షూట్ కంప్లీట్ అయింది. ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. కాగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న చిత్రం ఇంది. ఈ మూవీలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది.   సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 26న ఈ ఫన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో నితిన్ ఓ ఫన్నీ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి లెజెండ్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement