Sunday, May 5, 2024

మహేష్ ఫ్యాన్స్ లో జోష్ నింపిన అర్జున్ రెడ్డి డైరెక్టర్ !!

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదల అయిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలోనే ఈ సినిమా ఉంటుందని… ఒక ఫ్రెష్ సబ్జెక్ట్ తీసుకుని ఈ సినిమా తీయబోతున్నట్లు చెప్పుకొచ్చారు సందీప్. ఇప్పటికే స్టోరీ కూడా రెడీ అయినట్లు తెలిపారు. దీనిని పూర్తి చేసిన తర్వాత రాజమౌళితో సినిమా స్టార్ట్ చేయనున్నాడట మహేష్. ఇక సందీప్ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులలో మరింత ఉత్సాహం పెంచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement