Thursday, April 25, 2024

హైదరాబాద్ టూ దుబాయ్: 180 సీట్లున్న విమానంలో ముగ్గురే వెళ్లారు..

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఓ విమానంలో హైదారబాద్ నుంచి దుబాయ్ వెళ్లారు. ఆ ఫ్యామిలీనే ఆ ప్లయిట్ ను ప్రత్యేకంగా బుక్ చేసుకందనుకునేరు. కానేకాదు…సాధారణ ప్రయాణికులుగా టికెట్లు బుక్ చేసుకున్నారు వారు…కాని ఎవరికీ లభించని అద్భుతమైన అవకాశం ఆ కుటుంబానికి లభించింది. విమానంలో వీరు ముగ్గురు తప్ప ఇతరు ప్రయాణికులు ఎవరూ లేకపోవడం విశేషం. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. 180 మంది ప్రయాణించడానికి వీలుండే విమానంలో ముగ్గురు సభ్యులతో కూడిన కుటుంబం మాత్రమే ప్రయాణించింది. హైదరాబాద్‌ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

వివరాల్లోకి వెళ్తే, కరీంగర్ కు చెందిన శ్రీనివాసరెడ్డి, హరితరెడ్డి దంపతులు గత పదేళ్లుగా దుబాయ్ లో నివాసం ఉంటున్నారు. హరితరెడ్డి దుబాయ్ లో డాక్టర్ గా పని చేస్తుండగా… శ్రీనివాసరెడ్డి టెక్ మహీంద్రాలో ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 18న హరితరెడ్డి తండ్రి సత్యనారాయణరెడ్డి మృతి చెందడంతో… వారిద్దరూ తమ కొడుకు సంజిత్ రెడ్డితో కలిసి అదే రోజున ఇండియాకు వచ్చారు. ఆ తర్వాత ఇండియాలో కరోనా కేసులు పెరిగిపోవడంతో… భారత విమానాలపై యూఏఈ నిషేధం విధించింది. దీంతో వీరు ఇక్కడే ఉండిపోయారు.

మధ్యలో ఆరుసార్లు విమాన టికెట్లను కొన్నప్పటికీ… నిబంధనలు మారుతుండటంతో వారి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, గోల్డెన్ వీసా ఉన్న వారు రావచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో… వీరిద్దరూ దుబాయ్ కు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి యూఏఈ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో దుబాయ్ కు పయనమయ్యారు. అయితే, విమానంలో ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో… వీరు ముగ్గురితోనే విమానం బయల్దేరింది. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఎయిర్ బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం హైదరాబాద్ నుంచి షార్జాకు చేరుకుంది. వీరి ప్రయాణానికి సంబంధించి ఫొటో, వీడియో ఇప్పడు వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: అలర్ట్: సెప్టెంబర్‌ 1 నుంచి పీఎఫ్‌ సేవలు కొసాగాలంటే ఇలా చేయండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement