Saturday, May 4, 2024

‘ప్రభాస్’ చేతుల మీదుగా ‘జాతిరత్నాలు’ ట్రైలర్

దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తోన్న చిత్రం జాతిరత్నాలు..అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ సపోర్ట్ తో తెరకెక్కుతోందీ మూవీ. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి..రాహుల్ రామకృష్ణ..ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు.ఈ జాతిరత్నాల్లో నేను ఒకడినంటూ.. ఈ చిత్రానికి యంగ్‌ రెబల్‌ స్టార్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ సపోర్ట్ ఇస్తుండటం వెరసీ.. ఈ సినిమా ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీ అవుతోంది.  ఈ చిత్రం కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శ‌కుడు. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తోంది. రూ. 500 కోట్ల చుట్టూ తిరిగే ఈ కథను నాగ్‌ అశ్విన్‌ ఇన్‌పుట్స్‌తో అనుదీప్‌ అదిరిపోయే లెవల్‌లో తెరకెక్కించారట. ఇటీవల వచ్చిన టీజర్‌ చూస్తే.. ఆ విషయం అర్థమవుతుంది. ఇక ఈ చిత్రానికి పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కూడా ఓ చెయ్యి వేయబోతున్నారు. చిత్ర ట్రైలర్‌ను ప్రభాస్‌ చేతుల మీదుగా విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. మార్చి 4 సాయంత్రం 4గంటల 20 నిమిషాలకు ఈ ట్రైలర్‌ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. మార్చి 11న ‘జాతిర‌త్నాలు’ థియేట‌ర్ల‌లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement