Sunday, May 5, 2024

అసోంలో శ్రీకాకుళం ఆర్మీ జవాన్ మృతి

అసోంలో జరిగిన ఓ ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ మృతి చెందాడు. జిల్లాకు చెందిన రామారావు అనే ఆర్మీ జవాన్ అసోంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన మరికొందరు జవాన్‌లతో కలిసి ఓ వాహనంలో వెళ్తుండగా మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనిపించకపోవడంతో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రామారావు చనిపోయాడు. ఆయన మృతి చెందిన విషయంపై ఆర్మీ అధికారులు ఆయన కుటుంబానికి సమాచారం అందించారు. కాగా రామారావు స్వస్థలం శ్రీకాకుళం పట్టణంలోని ఇల్లిసుపురం అని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement