Tuesday, May 7, 2024

జేకేమైన్స్ లో ‘ఆచార్య’ షూట్..పర్మిషన్ గ్రాంటెడ్

ఇల్లందులోని జేకే మైన్స్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య మూవీ షూటింగ్ జరగనుంది.  ఈ చిత్ర షూటింగ్‌ మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఇల్లందులోని జేకే మైన్స్‌లోని ఓపెన్‌కాస్ట్‌, అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లో షూటింగ్‌ జరుగనుంది. హీరో చిరంజీవితో పాటు రాంచరణ్‌పై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ మేరకు అవసరమైన అనుమతులు ఇప్పించాలని దర్శకుడు కొరటాల శివ.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను కోరారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. షూటింగ్‌ కోసం స్థానికంగా అనుమతి ఇప్పించడంతో పాటు హీరో చిరంజీవికి తన నివాసంలో ఆతిథ్యం ఏర్పాటు చేస్తానని తెలిపారు. పర్యాటకంగా ఖమ్మం అభివృద్ధి చెందిందని, వివిధ చిత్రాల షూటింగ్‌ల కోసం ఖమ్మం జిల్లా ఎంతో అనువైన ప్రదేశమని కొరటాల శివ పేర్కొన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం ఖమ్మం స్వరూపం నేడు పూర్తిగా మారిపోయిందన్నారు. ఇందుకు కృషి చేసిన మంత్రి పువ్వాడకు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement