Friday, May 3, 2024

‘చావుకబురు చల్లగా సాంగ్’ ప్రోమో రానుంది..

యంగ్ హీరో కార్తికేయ నటిస్తోన్ చిత్రం చావు కబురు చల్లగా. ఈ చిత్రంలో అనసూయ ఐటెం సాంగ్ చేస్తుందని ఆ చిత్ర మేకర్స్ వెల్లడించారు. కాగా ఈ సాంగ్ కి సంబంధించిన అప్ డేట్ వచ్చింది. పైన పటారం అనే పల్లవితో సాంగ్ స్టార్ట్ అవుతుండగా ఈ సాంగ్ వీడియో ప్రోమోను ఈ రోజు శనివారం సాయంత్రం 4.05ని.లకు రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ లో పోస్ట‌ర్‌లో కార్తికేయ‌, అన‌సూయ చాలా ఎనర్జిటిక్‌గా క‌నిపిస్తున్నారు.   మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా రూపొందుతున్న చావు క‌బ‌రు చ‌ల్ల‌గా చిత్రంలో  ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించారు.  నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement