Saturday, May 4, 2024

గ్రామంలో బోర్లు వేయించిన ‘సోనూసూద్’

ఓ గ్రామానికి నీరందించేందుకు ముందుకొచ్చారు హీరో సోనూసూద్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్నగ్రామం నీటి కోసం అవస్థలు పడుతున్న విషయాన్ని జితేంద్ర అనే వ్యక్తి హీరో సోనూసూద్ దృష్టికి తీసుకువచ్చాడు. అక్కడి వారు మంచి నీటి కోసం చాలా దూరం వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో   సోనూసూద్ ఆ గ్రామం వారి కోసం మంచి నీరు అందించేందుకు తన ఫౌండేషన్ తరపున ముందుకు వచ్చారు. సూద్ ఫౌండేషన్ ప్రతినిధులు గ్రామంలో పరిస్థితిని మరోసారి సమీక్షించి విషయాన్ని తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకు నీటి అవసరం చాలా ఉందని కనీసం మంచి నీరు లేక వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించి చలించి పోయిన సోనూ సూద్ వెంటనే తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అక్కడ బోర్లు వేయించారు. బోర్లు వేయించడంతో పాటు చేతి పంపులను కూడా ఏర్పాటు చేసి నీటి అవసరాలను తీర్చాడు. బోరు వేస్తున్న సమయంలో ఆ గ్రామ ప్రజలు ఆసక్తిగా చూడటం తన మనసును హత్తుకుంది అంటూ సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందిని సోనూ సూద్ తీర్చడంతో గ్రామస్తులు అంతా కూడా ఆయనకు రుణ పడి ఉన్నామని అంటున్నారు. మరోసారి సోనూ సూద్ మంచి మనసుకు ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా నీరాజనాలు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement