Friday, April 26, 2024

కోవర్ట్‌ ఆపరేషన్ లో పరిణీతి చోప్రా

బాలీవుడ్ ముద్దగుమ్మ పరిణీతి చోప్రా ఎన్‌ఐఏ ఏజెంట్‌గా పనిచేయనున్నారు. ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. అది పరిణీతి త్వరలో చేయబోయే సినిమా కోసమే…పరిణీతి లీడ్ రోల్ లో రిబుదాస్‌ గుప్తా దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని బాలీవుడ్లో‌ తాజా సమాచారం. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పరిణీతి ఎన్‌ఐఏ ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారట. ఓ కోవర్ట్‌ ఆపరేషన్‌తో దోషులను చట్టానికి అప్పగిస్తారట. మరి… ఈ ఆపరేషన్‌ను పరిణీతి ఎలా డీల్‌ చేశారన్నది తెలియాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే దర్శకుడు రిబుదాస్‌ గుప్తా, హీరోయిన్‌ పరిణీతి చోప్రా కాంబినేషన్‌లో ‘ద గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయిన ఈ సినిమాకు వ్యూయర్స్‌ నుంచి మంచి స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement