Friday, April 26, 2024

ఒలింపిక్స్-2021 లోగో, మస్కట్ ఆవిష్కరణ

టోక్యో ఒలింపిక్స్ పోటీలను నిర్వహించేందుకు జపాన్ సిద్ధమవుతోంది. ఈ మహా క్రీడా సంగ్రామం మరో 100 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ మస్కట్‌, చిహ్నాలను నిర్వహణ కమిటీ ఆవిష్కరించింది. కరోనా ముప్పు పొంచి ఉండటంతో వైరస్ నిరోధానికి ఆరోగ్య సిబ్బంది శ్రమిస్తున్నట్లు టోక్యో గవర్నర్‌ యురికో తెలిపారు.

కరోనా కేసులు పెరుగుదల, క్రీడల పేరుతో కుంభకోణాలు జరిగాయంటూ ప్రజల నుంచి ఒలింపిక్స్‌ నిర్వహణపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వివిధ సంస్థలు నిర్వహించిన ఒపినీయన్ పోల్స్‌లో.. 80శాతం జపాన్ ప్రజలు ఒలింపిక్స్ పోటీలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కోరుతున్నట్లు తేలింది. అయినా ఒలింపిక్స్‌ క్రీడలను నిర్వహించాలని నిర్వహణ కమిటీ పట్టుదలను ప్రదర్శిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement