Sunday, May 5, 2024

‘ఓవియా’ మరోట్వీట్

హీరోయిన్ ఓవియా మరో ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ నెల 14వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెన్నై నగర పర్యటనలో భాగంగా   గో బ్యాక్‌ మోడీ అంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్త చేస్తూ, ఆమెపై చర్య తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో నటి ఓవియాపై ఐపీసీ 124(ఏ), 153(ఏ), 294 సెక్షన్ల కింద కేసు నమోదు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్‌ ఖాతాలో మరో ట్వీట్‌ చేసింది. జైహింద్‌, ఫ్రీడమ్‌ఆఫ్‌థాట్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌కు ఆమె అభిమానులు లైక్‌ చేస్తూ ఫార్వర్డ్‌ చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్‌ట్యాగ్‌లు ఇపుడు వైరల్‌ అవుతున్నాయి. అలాగే, 500 మందికి పైగా నెటిజన్లు రీట్వీట్‌ చేశారు. 80 మంది మాత్రం కామెంట్స్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement