Sunday, April 28, 2024

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లలో గత ఏడు సెషన్లుగా కొనసాగిన ర్యాలీకి ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయినప్పటికీ… ఆ తర్వాత తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి… సెన్సెక్స్ 2 పాయంట్ల నష్టంతో 51,934కి చేరింది. నిఫ్టీ 8 పాయింట్లు కోల్పోయి 15,574 వద్ద స్థిరపడింది

Advertisement

తాజా వార్తలు

Advertisement