Sunday, May 5, 2024

త్వరలో వన్‌ప్లస్‌ దీపావళి సేల్‌.. యాప్​ ద్వారా కొనేవారికి భారీ ఆఫర్లు

త్వరలోనే దీపావళి సేల్‌ 2023ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ప్రకటించింది. వన్‌ప్లస్‌ యాప్‌ ద్వారా కొనుగోలు చేయబోయే వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది. వన్‌ప్లస్‌ 11 5జీ, వన్‌ప్లస్‌ బడ్స్‌ ప్రో2, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ట్యాబ్లెట్‌పై ఆకర్షణీయ ఆఫర్లు ఉన్నట్లు తెలిపింది. యాప్‌ ద్వారా కొనుగోలు చేయబోయే వారికి ఈ సేల్‌లో 18 నెలల ఈఎంఐ, ఎంపిక చేసిన మోడల్స్‌పై ఉచిత యాక్సెసరీస్‌ వంటి వాటిని అందించనున్నట్లు తెలిపింది.

వన్‌ప్లస్‌ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ రూ.49,999 రాయితీ ధర వద్ద లభించనున్నట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది. బ్యాంకు ఆఫర్లనూ ఉపయోగించుకొని మరో రూ.4,000 ఆదా చేసుకోవచ్చు. దీనిపై బడ్స్‌ జెడ్‌2 టీడబ్ల్యూఎస్‌ ఇయర్‌ఫోన్స్‌ ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌ ధర భారత్‌లో రూ.56,999. ఈ సేల్‌లో వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 లైట్‌ 5జీ ఫోన్‌ రూ.17,499, వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 5జీ రూ.28,999, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 3 5జీ రూ.22,999 ప్రారంభ ధర వద్ద లభించనున్నట్లు తెలిపింది.

ఈ ధరలు బ్యాంకు ఆఫర్లతో కలిపి అని వన్‌ప్లస్‌ వెల్లడించింది. అదేవిధంగా, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ రూ.36,999 తగ్గింపు ధర వద్ద లభించనున్నట్లు వెబ్‌సైట్‌లో కంపెనీ పేర్కొంది. త్వరలో విడుదల కానున్న వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గోను సైతం ఈ సేల్‌లో విక్రయానికి ఉంచనున్నట్లు తెలిపింది. దీనిధరను అక్టోబర్‌ 6 విడుదల తర్వాతే ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement