Monday, April 29, 2024

న్యూ బీఎండబ్ల్యూ ఎఫ్‌ 900 ఎక్స్ఆర్‌ విడుదల.. అడ్వెంచర్ స్పోర్ట్స్ బిల్ట్ అప్ యూనిట్స్..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : న్యూ బీఎండబ్ల్యూ ఎఫ్‌ 900 ఎక్స్‌ఆర్‌ భారతదేశంలో మంగళవారం విడుదలైంది. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ టూరర్‌ కంప్లీట్లీ బిల్ట్ అప్ యూనిట్స్‌ (సీబీయూ)గా లభిస్తుంది. బీఎండబ్ల్యూ మోటార్రాడ్‌ డీలర్‌షిప్స్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ కొత్త ప్రొఫైల్‌ బైక్‌ డెలివరీ జూన్‌ 2022 నుంచి ప్రారంభమవుతుంది. ఈసందర్భంగా బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పావాహ్‌ మాట్లాడుతూ… బీఎండబ్ల్యూ మోటార్రాడ్‌ ప్రపంచంలో అత్యుత్తమ ప్రీమియం మోటార్‌ సైకిల్స్‌ను భారతదేశానికి తీసుకువచ్చిందన్నారు. ఎక్స్‌ ఆర్‌ మోటార్‌ సైక్లింగ్‌ ఔత్సాహికుల్లో తనకు ప్రత్యేకమైన స్థానాన్ని సృష్టించుకుందన్నారు. అథ్లెటిజం, దూర ప్రదేశాలకు రైడింగ్‌ పర్‌ఫార్మెన్స్‌లలో సరిసాటిలేని సమ్మేళనాన్ని కలిగి ఉందన్నారు. అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ టూరర్‌ బీఎండబ్ల్యూ ఎఫ్‌ 900 ఎక్స్‌ఆర్‌ కొత్త ప్రొఫైల్‌ శక్తియుతమైన ఫీచర్స్‌తో ప్రత్యేక పనితీరు సమ్మేళనాన్ని కలిగి ఉందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement