Friday, May 3, 2024

జూన్ నెల జీఎస్టీ ఆదాయం రూ.92,849 కోట్లు

జూన్ నెలకు సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూన్ నెలలో జీఎస్టీ ఆదాయం రూ.92,849 కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ వసూళ్లు రూ.16,424 కోట్లు నమోదు కాగా రాష్ట్రాల జీఎస్టీ వసూళ్లు రూ.20,397 కోట్లు. ఇక సమీకృత జీఎస్టీ వసూళ్లు రూ.49,079 కోట్లు కాగా, సెస్ రూపేణా రూ.6,949 కోట్లు వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది.

2020 జూన్ నెలతో పోల్చితే ఈ జూన్‌లో 2 శాతం ఆదాయం పెరిగినట్టు తెలిపింది. అయితే ఇటీవలి సరళితో పోల్చితే జూన్ నెలలో జీఎస్టీ రాబడి తగ్గిందని వివరించింది. 9 నెలల తర్వాత తొలిసారి లక్ష కోట్లకు దిగువన జీఎస్టీ రాబడి నమోదైందని పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్పన్నమైన సంక్షోభం ఆర్థిక, వాణిజ్య వ్యవస్థలపై ప్రభావం చూపినట్టు నిపుణులు భావిస్తున్నారు. అయితే ఇదేమంత ఆందోళన చెందాల్సిన అంశం కాదని, పరిస్థితులు కుదుటపడితే, భారీగా జీఎస్టీ వసూళ్లు వస్తాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాగా ఇప్పటివరకు అత్యధిక మొత్తంలో జీఎస్టీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైంది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో రూ.1.41 లక్షల కోట్లు వసూలు కాగా, మే నెలలో రూ.1.02 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.

ఇది కూడా చదవండి: నోకియా నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్

Advertisement

తాజా వార్తలు

Advertisement