Friday, April 26, 2024

నాడు-నేడుపై వాడివేడిగా జడ్పీ సమావేశం

కర్నూలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన త్రాగు నీరు, నిరుపేదలందరికీ ఇల్లు, రెండో విడత నాడు-నేడు, నాల్గవ విడత కోవిడ్ -19, ఇతర ప్రాధాన్యత అంశాలపై కర్నూల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా నిర్వహించారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, నంద్యాల జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కంగాటి శ్రీదేవి , బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement