Wednesday, May 1, 2024

TS: కాంగ్రెస్ ను బొంద పెట్టండి… బోయిన్ ప‌ల్లి వినోద్ కుమార్

హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని లోక్ స‌భ‌ ఎన్నికల్లో బొంద పెట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్ ప‌ల్లి వినోద్ కుమార్ కోరారు. శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిందన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా హామీలు అమలు చేయడం మాత్రం మర్చిపోయారన్నారు. మత రాజకీయాలకు బీజేపీ పెట్టింది పేరన్నారు.

మే 13న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి తనను లోక్ స‌భ‌కు పంపిస్తే అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు అందించడంతో పాటు కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్లు తోటరాములు, ఐలేందర్ యాదవ్, నాయకులు కలర్ సత్తన్న, సత్తినేని శ్రీనివాస్, వొల్లాల శ్రీనివాస్ గౌడ్, బెజిగం మధు, చొక్కారపు చంద్రం, రవి నాయక్, కెమసారం తిరుపతి, జీఎస్ ఆనంద్, గూడెల్లి రాజకుమార్, అంజి యాదవ్ లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement