Thursday, May 2, 2024

టీడీపీ నేతలు ఉగ్రవాదులు..దొంగల ముఠా ఉండొద్దు

టీడీపీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ ఉండకూడదని, ఆ పార్టీని రద్దు చేయాలని నిన్న ఎన్నిక‌ల స‌ఘాన్ని ఆయ‌న కోరిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావిస్తూ ట్వీట్ చేశారు.

‘టీడీపీ నేతలు ఉన్మాదుల్లా, ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. ఇలాంటి దొంగల ముఠాకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదు. అందుకే టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ ను కోరాం’ అని విజ‌య‌సాయిరెడ్డి అన్నారు.

‘అసభ్య పదజాలంతో దూషిస్తున్న టీడీపీ నేతలు నారా లోకేష్, పట్టాభి, దేవినేని ఉమ, బోండా ఉమ, అయ్యన్నలపై ఈసీ చర్యలు తీసుకోవాలి. వీరు వాడుతున్న పదజాలం గురించి తెలుసుకున్న ఎలక్షన్ కమిషనర్లే ఆశ్చర్యపోయారు. ఇలాంటి వారిని ఎన్నికల ప్రక్రియ నుంచి బహిష్కరించాలి’ అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.  

ఇది కూడా చదవండి: ‘ధరణి’కి ఏడాది.. 10 లక్షలకుపైగా లావాదేవీలు

Advertisement

తాజా వార్తలు

Advertisement