తెలుగుదేశం పార్టీ ..వైఎస్ ఆర్ కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఈ పార్టీ వెనకబడింది. పార్టీ కార్యక్రమాలు కూడా తగ్గాయనే చెప్పాలి. కాగా టిడిపిలోని పలువురు నేతలకు కీలక పదవులు దక్కాయి. ఈ మేరకు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ప్రకటన కూడా చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గానికి చెందిన జీవీరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. కాగా నెట్టెం రఘురామ్ను విజయవాడ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించగా, తిరువూరుకు చెందిన రఘువరపు శ్రీనివాసరావు, మైలవరానికి చెందిన కలకొండ వీర సత్యనారాయణ, విజయవాడ తూర్పుకు చెందిన లింగమనేని శివరామ్ప్రసాద్, నందిగామకు చెందని వడ్డెల్లి సాంబశివరావు, మైలవరానికి చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ పశ్చిమకు చెందిన ఎం.తిరుమలేశ్, విజయవాడ సెంట్రల్కు చెందిన డీజేపీఎన్ రాజును ఉపాధ్యక్షులుగా నియమించారు.
అలాగే, వాసం మునయ్యను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ బాధ్యుడిగా మన్నె సుబ్బారెడ్డిని, పి.గన్నవరానికి చెందిన వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణను బీసీ పెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా, విజయవాడకు చెందిన మహమ్మద్ ఫతావుల్లాను మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న పార్టీ మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే పార్టీనే నమ్ముకుని ఉన్న పలువురు నేతలకు కీలక పదవులని కట్టబెట్టారు. పార్టీ నేతలంతా ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.