Friday, May 3, 2024

ప్రజాసంకల్పానికి నాలుగేళ్లు.. వైసీపీ నేతల సంబరాలు

వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన ప్రజాసంకల్పా యాత్ర నాలుగేళ్లు పూర్తి అయిన సందర్భంగా వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు వైఎస్సార్ సర్కిల్ ఆవరణలో శనివారం పిచ్చాటూరు మండల కన్వీనర్ కె.టి హరిచంద్రరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి ఇచ్చాపురంలో ముగించడం ఓ చరిత్ర అని అన్నారు. 341 రోజులు పాటు 3648 కిలోమీటర్లు పాదయాత్రలో సంక్షేమ, ప్రగతి పాలనకు పునాదులు వేసి క్షేత్రస్థాయిలో సమస్యల గుర్తించి, ప్రభుత్వ సారథిగా వాటి పరిష్కారం కోసమే నవరత్నాలు అమలు పరిచి సుపరిపాలనకు దిశగా ప్రభుత్వం ప్రయాణిస్తున్నదిన్నారు. ఈ కార్యక్రమంలో పిచ్చాటూరు సర్పంచ్ కె.జి.రోస్ రెడ్డి , రాజనగరం సర్పంచ్ భూపతి , వైకాపా ఎస్సి సెల్ జిల్లా కార్యదర్శి తొప్పయ్య , బీరేంద్రవర్మ  కో ఆప్షన్ మెంబర్ ఇస్మాయిల్  , అన్నదొర , గోవిందన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement