Monday, April 29, 2024

గోప‌న్ ప‌ల్లిలో ఉద్రిక్త‌త

హైద‌రాబాద్ ప‌రిధిలోని గోప‌న్ ప‌ల్లిలో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. గోప‌న్ ప‌ల్లి-తెల్లాపూర్ మ‌ధ్య రోడ్డు నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. గోప‌న్ ప‌ల్లి తండాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలు కూల్చివేసేందుకు అధికారులు సిద్ధ‌మ‌య్యారు. నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేత‌లు చేప‌ట్ట‌డంపై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఆందోళ‌న‌కు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహ‌రించారు. నిర్మాణాలు కూల్చివేయొద్దంటూ స్థానికులు కోరుతుండ‌గా, ఇవి అక్ర‌మ నిర్మాణాల‌ని అధికారులు కూల్చివేస్తుండ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement