Wednesday, March 27, 2024

రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల్లో ఉద్రిక్త‌త‌..అధికారుల‌ను అడ్డుకున్న స్థానికులు..

గ‌చ్చిబూలి గోప‌న్ ప‌ల్లిలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. గోప‌న్ ప‌ల్లి..తెల్ల‌పూర్ మ‌ధ్య రోడ్డు విస్త‌ర‌ణ ప‌నులు కొన‌సాగుతున్నాయి. గోప‌న్ ప‌ల్లి తండాలో రోడ్డుకు ఇరువైపులా నిర్మాణాలు ఉన్నాయి. వాటిని కూల్చేందుకు సిద్ధ‌మ‌య్యారు అధికారులు. దాంతో స్థానికులు అధికారుల‌ను అడ్డుకున్నారు. నోటీసులు ఇవ్వ‌కుండా ఎలా కూల్చివేస్తార‌ని ఆందోళ‌న‌కి దిగారు. ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో అక్క‌డ పోలీసులు భారీగా మోహ‌రిల్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement