Wednesday, April 24, 2024

Breaking : బేగంపేట పేకాట కేసులో కొత్త కోణం..5గురు అరెస్ట్..కోట్ల రూపాయ‌లు సీజ్..

బేగంపేట పేకాట కేసులో కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. స్థానికుల స‌మాచారంతో పేకాట అడ్డాపై పోలీసులు దాడి చేశారు. ఈ అడ్డాని అర‌వింద్ అగ‌ర్వాల్ అనే వ్య‌క్తి నిర్వ‌హిస్తున్నాడు. వ్యాపార వేత్త‌లు..నాయ‌కుల‌తో అర‌వింద్ అగ‌ర్వాల్ కు ప‌రిచ‌యాలు ఉన్నాయి. అర‌వింద్ అగ‌ర్వాల్ వాట్సాప్ లో ఇన్విటేష‌న్ తో పాటు లొకేష‌న్ షేర్ చేస్తున్నాడు. అర‌వింద్ అగ‌ర్వాల్ ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు. అర‌వింద్ అగ‌ర్వాల్ తో పాటు న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100మంది దొరికితే పోలీసులు మాత్రం ఐదుగురినే అరెస్ట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. కోట్ల రూపాయ‌ల న‌గ‌దుని సీజ్ చేశార‌ని స్థానికులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement