Tuesday, May 7, 2024

YSRCP Appeal – ఆ ఆరుగురి పై అనర్హత వేటు వెయ్యండి

అమరావతి:పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వైసీపీ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటేయాలని ఫిర్యాదు చేసింది వైసీపీ. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై అనర్హత వేటేయాలని అసెంబ్లీ కార్యాలయంలో వైఎస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి. రామచంద్రయ్యలపై కూడ అనర్హత వేటేయాలని వైఎస్ఆర్‌సీపీ శాసనమండలి చైర్మెన్ కు ఫిర్యాదు చేసింది.

గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో చేరారు. మిగిలిన వారు కూడ తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు. విశాఖ జిల్లాకు చెందిన వంశీకృష్ణ ఇటీవలనే వైఎస్ఆర్‌సీని వీడి జనసేనలో చేరారు. మరో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య తెలుగు దేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement