Tuesday, May 7, 2024

Tributes – ఇడుపుల‌పాయ ఘాట్ లో వైఎస్ఆర్ కు జ‌గ‌న్ నివాళి ..

ఇడుపుల‌పాయ – దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ త‌న‌యుడు జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ తల్లి విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్‌కు నివాళులర్పించారు. . అనంతరం ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు.

అంతకుముందు ఉదయం వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement