Sunday, April 28, 2024

వైరల్ వీడియో: యువకుడిపై ఎస్ఐ దాడి

సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో వేణు అనే ఫిర్యాదు దారుడిపై ఎస్ఐ రంగడు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏప్రిల్ 28న వేణు గోపాల్ తన తల్లి వృద్ధాప్య పించన్ రాకుండా స్థానికంగా వున్న అధికారపార్టీ నాయకులు అడ్డుపడుతున్నారని ఎస్ఐ రంగడు వద్దకు వెళ్లగా.. ఎస్ఐ రంగడు తనపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాద్య మాల్లో ఈ వీడియో వైరల్ కావడంతో సత్య సాయి జిల్లా ఎస్పి రాహుల్ దేవ్ సింగ్ విచారణకి ఆదేశాలు జారీ చేశారు. పెనుగొండ డీస్పీ రమ్యశ్రీ విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement