Monday, April 29, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ల‌క్నో

ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలిమ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతుండగా… రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఆడనున్నాయి. తొలి మ్యాచ్ లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ నుంచి ఆవేశ్ ఖాన్ కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అతడి స్థానంలో గౌతమ్ జట్టులోకి వచ్చాడని లక్నో సారథి కేఎల్ రాహుల్ వెల్లడించాడు. ఇక ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement