Thursday, March 28, 2024

పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరూరి శంకుస్థాపన

గ్రేటర్ వరంగల్ లో పలు అభివృద్ధ పనులను మేయర్ గుండూ సుధారాణితో కలిసి ఎమ్మెల్యే అరూరి రమేష్ శంకుస్థాపన చేశారు. 45వ డివిజన్ పరిధిలోని కడిపికొండ, కుమ్మరిగూడెం గ్రామాలలో సుమారు 36 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా డివిజన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్లు పూర్తిగా విలీన గ్రామాలతో నిండి ఉన్నాయని తెలిపారు. విలీన గ్రామాల అభివృద్ధికి అత్యధిక నిధులు వెచ్చించి గ్రామాలలో పట్టణ వాతావరణం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement