Friday, April 26, 2024

చిత్తూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

చిత్తూరు జిల్లా సాంబయ్య కండ్రిగలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరిస్తోందని ఓ యువతిని చిన్నా అనే యువకుడు కత్తితో గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత తనను తాను గొంతుకోసుకొని ఆత్మహత్యకు యత్నించి పడిపోగా.. కోపోద్రిక్తులైన స్థానికులు బండరాళ్లతో కొట్టి చంపారు. కండ్రిగ గ్రామానికి చెందిన సుష్మను ప్రేమ పేరుతో చిన్నా అనే యువకుడు వేధిస్తున్నాడు. తనకు ఇష్టం లేదని చెప్పినా.. వినకపోవడంతో ఇటీవల చిన్నాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుష్మపై కక్ష పెంచుకున్న చిన్నా శుక్రవారం యువతి ఇంటికి వెళ్లి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన యువతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం యువకుడు తనను తాను గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే పడిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురై బండరాళ్లతో కొట్టి చంపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే, గతంలో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే చర్యలు తీసుకొని ఉంటే తమ బిడ్డ ప్రాణాలతోనే ఉండేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే యువతి ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement