Tuesday, April 30, 2024

నీలో సాహ‌సం ఉంటే.. దేశం అంధ‌కారంలో ఉంటుందా..! ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్వీట్

ప‌వ‌ర్ స్టార్ ..జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. రణస్థలంలో జనసేన నిర్వహించే ‘యువశక్తి’లో సభలో పాల్గొంటారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు యువశక్తి కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 100 మంది యువకులు ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రెండు రాజకీయ తీర్మానాలు చేయనున్నారు. కాగా స్వామి వివేకానంద జ‌యంతి సంద‌ర్భంగా యువ‌త‌కి శుభాకాంక్షలు తెలిపారు.

మన జాతి భవిష్యత్తు మీదే.. జై హింద్ అంటూ పవన్‌ ట్వీట్ చేశారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని రాసి ఉన్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం తాళ్లవలస సమీపంలో 25 ఎకరాల ప్రాంగణంలో వేదిక సిద్ధమైంది. పవన్‌తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్‌ నిన్న రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్‌రే రిసార్ట్స్‌కు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement