Thursday, April 18, 2024

భారత్ లో కొత్తగా 197 కరోనా కేసులు.. ఒకరు మృతి

భార‌త్ లో క‌రోనా మహమ్మారి కేసులు పెరుగుతూ, త‌గ్గుతూ న‌మోద‌వుతున్నాయి. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఈరోజు కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 197 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,80,583 కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,309 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. గ‌డిచిన 24గంట‌ల్లో క‌రోనాతో ఒక్కరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 5,30,723 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 229 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement