Sunday, April 28, 2024

టీడీపీ మహానాడుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దివంగత ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కనుమరుగయిందని ఆయన అన్నారు. చంద్రబాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ ఫినిష్ అయిపోయిందన్నారు. అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే టీడీపీ పరిమితమయిందని వ్యాఖ్యానించారు. కుప్పంలోనే టీడీపీ కొట్టుకుపోయిన తర్వాత… అచ్చెన్న మాటలు నిజం కాకుండా ఎలా పోతాయని పేర్కొన్నారు. టీడీపీకి ఇప్పుడు జూమ్ మహానాడులే మిగిలాయని విమర్శించారు.

‘’జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు. ప్రజలను గాలికొదిలేశారు సరే పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశంనూ పట్టించుకోలేదు. అద్దె మైకులతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కూన, గంటా ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా?. ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో ఆ జూమ్ నాడులో ఏడవండి. ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన?‘’ అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement