Saturday, May 11, 2024

ఓటుకు నోటు కేసు: చంద్రబాబుకు రిలీఫ్‌..

ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్‌ దొరికింది. ఈడీ చార్జ్‌ చేసిన షీట్‌లో చంద్రబాబు పేరు కనిపించలేదు. దీంతో చంద్రబాబుకు ఈ కేసుతో ఉపశమనం లభించింది. ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం ఎంపీ రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏసీబీ గతంలో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ ఆధారంగా ఎంపీ రేవంత్‌పై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది. అయితే ఈ చార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో టీడీపీ అధినేతకు ఓటుకు నోటు కేసులో ఉపశమనం కలిగింది. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి 50 లక్షలు ఇచ్చినట్టు ఏసీబీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. మండలి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ చేసే విధంగా.. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రాయబారం నడిపినట్టుగా రేవంత్‌రెడ్డిపై చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. వేం నరేందర్‌రెడ్డికి ఓటు వేయాల్సిందిగా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేశారని ఏసీబీ అభియోగం మోపింది. ఛార్జ్‌షీట్‌లో ప్రధాన నిందితుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డిని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement